కాంచీపురంలో రష్యా దేశానికీ చెందిన బిచ్చగాడు
- October 10, 2017
కాలం కలసిరాకపోతే దేశం కాని దేశంలో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్ పర్యాటకుడిగా మన దేశం వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లుగోపురాలు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్ను రష్యా స్తంభింపజేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కొంత ధనసహాయం చేశారు. చెన్నై వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు మన దేశ విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ఏటీఎం పిన్ పనిచేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









