కాంచీపురంలో రష్యా దేశానికీ చెందిన బిచ్చగాడు
- October 10, 2017కాలం కలసిరాకపోతే దేశం కాని దేశంలో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్ పర్యాటకుడిగా మన దేశం వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లుగోపురాలు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్ను రష్యా స్తంభింపజేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కొంత ధనసహాయం చేశారు. చెన్నై వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు మన దేశ విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ఏటీఎం పిన్ పనిచేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ