కాంచీపురంలో రష్యా దేశానికీ చెందిన బిచ్చగాడు
- October 10, 2017
కాలం కలసిరాకపోతే దేశం కాని దేశంలో బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది. రష్యాకు చెందిన 24 ఏళ్ల ఇవాంజెలిన్ పర్యాటకుడిగా మన దేశం వచ్చాడు. కాంచీపురం గురించి తెలుసుకుని అనేక గుళ్లుగోపురాలు తిరిగాడు. సాంకేతిక కారణాల వల్ల అతని ఏటీఎం కార్డు పిన్ను రష్యా స్తంభింపజేసింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆకలి తీర్చుకోవడానికి కాంచీపురంలోని కుమారకొట్టం శ్రీసుబ్రహ్మణ్యస్వామి దేవాలయం మెట్లపై కూర్చుని బిచ్చమెత్తుకుంటున్నాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కొంత ధనసహాయం చేశారు. చెన్నై వెళ్లి రష్యా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. మరోవైపు మన దేశ విదేశీవ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. ఏటీఎం పిన్ పనిచేసేలా రష్యా అధికారులతో మాట్లాడతానని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









