హైదరాబాద్ శంషాబాద్లో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన
- October 11, 2017
ఓలా, ఉబర్ సంస్థలను నిషేధించి తమను ఆదుకోవాలంటూ.. క్యాబ్ డ్రైవర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. డ్రైవర్ల ఆందోళనలతో ఎయిర్పోర్ట్ దగ్గర ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఎన్నో ఆశలు కల్పించి.. తమతో కార్లు కొనిపించిన క్యాబ్ కంపెనీలు.. ఇప్పుడు ట్రిప్పులను సక్రమంగా కేటాయించలేదంటూ ఆరోపించారు డ్రైవర్లు. ఫైనాన్స్ డబ్బులు కట్టలేక.. కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం క్యాబ్ కంపెనీలు కేవలం 5 శాతం మాత్రమే ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నాయని.. యాప్ రూపొందిస్తే.. తాము పది శాతం పన్ను కడతామంటూ చెప్పారు డ్రైవర్లు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







