ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది నిర్వాకం: వాహనాల డ్యామేజీ
- October 12, 2017
మనామా: ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది పొరపాటుతో, పలు వాహనాలు డ్యామేజీకి గురయ్యాయి. ముహరాక్ గవర్నరేట్ పరిధిలోని ఓ ముఖ్యమైన ఫ్యూయల్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాప్కో) - హిద్ కన్య్సుమర్ కోఆపరేటివ్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న ఫ్యూయల్ స్టేషన్లో 91 ఆక్టేన్ జయ్యిద్ ఫ్యూయల్ ఫిల్ చేయాల్సి ఉండగా, ఆ వాహనాల్ని డీజిల్తో నింపివేశాడు. ఈ కారణంగా ఐదు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాప్కో సంస్థకీ సమాచారం అందించారు. దాంతో బాప్కో సంస్థ అవసరమైన చర్యలు చేపట్టింది. ఫ్యూయల్ స్టేషన్లో డీజిల్ మిక్స్ అయినందున తాత్కాలికంగా సేవల్ని రద్దు చేస్తున్నట్లు ఆ స్టేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామనీ ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









