ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది నిర్వాకం: వాహనాల డ్యామేజీ
- October 12, 2017
మనామా: ఫ్యూయల్ స్టేషన్ సిబ్బంది పొరపాటుతో, పలు వాహనాలు డ్యామేజీకి గురయ్యాయి. ముహరాక్ గవర్నరేట్ పరిధిలోని ఓ ముఖ్యమైన ఫ్యూయల్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ (బాప్కో) - హిద్ కన్య్సుమర్ కోఆపరేటివ్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న ఫ్యూయల్ స్టేషన్లో 91 ఆక్టేన్ జయ్యిద్ ఫ్యూయల్ ఫిల్ చేయాల్సి ఉండగా, ఆ వాహనాల్ని డీజిల్తో నింపివేశాడు. ఈ కారణంగా ఐదు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ క్రమంలో ముగ్గురు డ్రైవర్లు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాప్కో సంస్థకీ సమాచారం అందించారు. దాంతో బాప్కో సంస్థ అవసరమైన చర్యలు చేపట్టింది. ఫ్యూయల్ స్టేషన్లో డీజిల్ మిక్స్ అయినందున తాత్కాలికంగా సేవల్ని రద్దు చేస్తున్నట్లు ఆ స్టేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామనీ ఇకపై ఎలాంటి పొరపాట్లు జరగవని నిర్వాహకులు తెలియజేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









