భారత్ లో పాస్పోర్టు దరఖాస్తు మరింత సులభం
- October 12, 2017
చిన్నారులు, వృద్ధులకు 'వాక్ఇన్స్'
దివ్యాంగుల వేలిముద్రలు అక్కర్లేదు
నివాస ధ్రువీకరణగా 'అద్దె ఒప్పందం'
ఆర్పీవో ఉత్తర్వులు
పాస్పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరంకానుంది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి పాస్పోర్టు అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్ళలోపు చిన్నారులు, 60ఏళ్ళకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్లాట్ బుక్చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరంలేదు. తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్ఇన్ ఇంటర్వూలకు వెళ్ళిపోవచ్చు.
వికలాంగులు (చేతులు పనిచేయని లేదా కోల్పోయినవారు)ఐదేళ్ళ లోపు చిన్నారులకు 'వేలిముద్ర'లను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద...సంబంధిత రెంటల్ అగ్రిమెంట్ను అందించవచ్చు. తెలంగాణలోని అన్ని పాస్పోర్ట్ కార్యాలయాలు, సేవా కేంద్రాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఇ. విష్ణువర్ధన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







