భారత్ లో పాస్పోర్టు దరఖాస్తు మరింత సులభం
- October 12, 2017చిన్నారులు, వృద్ధులకు 'వాక్ఇన్స్'
దివ్యాంగుల వేలిముద్రలు అక్కర్లేదు
నివాస ధ్రువీకరణగా 'అద్దె ఒప్పందం'
ఆర్పీవో ఉత్తర్వులు
పాస్పోర్టు దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరంకానుంది. చిన్నారులు, వృద్ధులు, వికలాంగులతో పాటు అద్దె ఇళ్లలో నివాసముండే వారికి పాస్పోర్టు అధికారులు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకునే ఐదేళ్ళలోపు చిన్నారులు, 60ఏళ్ళకు పైబడిన వృద్ధులు ఇకపై ముందుస్తుగా స్లాట్ బుక్చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరంలేదు. తమ దరఖాస్తులు, సంబంధిత ధృవీకరణ పత్రాలతో నేరుగా వాక్ఇన్ ఇంటర్వూలకు వెళ్ళిపోవచ్చు.
వికలాంగులు (చేతులు పనిచేయని లేదా కోల్పోయినవారు)ఐదేళ్ళ లోపు చిన్నారులకు 'వేలిముద్ర'లను ఇవ్వాల్సిన నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అద్దె ఇళ్లలో ఉండేవారు ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద...సంబంధిత రెంటల్ అగ్రిమెంట్ను అందించవచ్చు. తెలంగాణలోని అన్ని పాస్పోర్ట్ కార్యాలయాలు, సేవా కేంద్రాల్లో ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ఇ. విష్ణువర్ధన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్