వొడాఫోన్‌ తో ఐడియా విలీనంకి షేర్ హోల్డర్స్ ఓకే.!

- October 13, 2017 , by Maagulf
వొడాఫోన్‌ తో ఐడియా విలీనంకి షేర్ హోల్డర్స్ ఓకే.!

అతిపెద్ద టెలికాం కంపెనీ అవతరణకు మరో అడుగుపడింది. తన మొబైల్‌ వ్యాపారాన్ని వొడాఫోన్‌తో విలీనం చేసే ప్రతిపాదనకు ఐడియాకు చెందిన వాటాదారులు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన వాటాదారులు సమావేశంలో 99 శాతం మందికిపైగా ఈ విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని ఆదిత్య బిర్లా గ్రూప్‌ తన ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు ఇరు కంపెనీలు ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించాయి. ఎన్‌సీఎల్‌టీ సూచనల మేరకు ఐడియా వాటాదారుల సమావేశాన్ని నిర్వహించింది. తదుపరి దశలో టెలికాం శాఖ (డీవోటీ) అనుమతిని పొందాల్సి ఉంది. వొడాఫోన్‌ ఇండియా, ఐడియా సెల్యూలార్‌ కంపెనీలు విలీనానికి ఈ ఏడాది మొదట్లోనే అడుగులు పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలూ విలీనం జరిగితే 35 శాతం వాటాతో 23 బిలియన్‌ డాలర్ల విలువైన అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. ప్రస్తుతం వొడాఫోన్‌, ఐడియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com