వొడాఫోన్ తో ఐడియా విలీనంకి షేర్ హోల్డర్స్ ఓకే.!
- October 13, 2017
అతిపెద్ద టెలికాం కంపెనీ అవతరణకు మరో అడుగుపడింది. తన మొబైల్ వ్యాపారాన్ని వొడాఫోన్తో విలీనం చేసే ప్రతిపాదనకు ఐడియాకు చెందిన వాటాదారులు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన వాటాదారులు సమావేశంలో 99 శాతం మందికిపైగా ఈ విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని ఆదిత్య బిర్లా గ్రూప్ తన ఫైలింగ్లో పేర్కొంది. అంతకుముందు ఇరు కంపెనీలు ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించాయి. ఎన్సీఎల్టీ సూచనల మేరకు ఐడియా వాటాదారుల సమావేశాన్ని నిర్వహించింది. తదుపరి దశలో టెలికాం శాఖ (డీవోటీ) అనుమతిని పొందాల్సి ఉంది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ కంపెనీలు విలీనానికి ఈ ఏడాది మొదట్లోనే అడుగులు పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలూ విలీనం జరిగితే 35 శాతం వాటాతో 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. ప్రస్తుతం వొడాఫోన్, ఐడియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







