వొడాఫోన్ తో ఐడియా విలీనంకి షేర్ హోల్డర్స్ ఓకే.!
- October 13, 2017
అతిపెద్ద టెలికాం కంపెనీ అవతరణకు మరో అడుగుపడింది. తన మొబైల్ వ్యాపారాన్ని వొడాఫోన్తో విలీనం చేసే ప్రతిపాదనకు ఐడియాకు చెందిన వాటాదారులు ఆమోదం తెలిపారు. గురువారం జరిగిన వాటాదారులు సమావేశంలో 99 శాతం మందికిపైగా ఈ విలీన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని ఆదిత్య బిర్లా గ్రూప్ తన ఫైలింగ్లో పేర్కొంది. అంతకుముందు ఇరు కంపెనీలు ఆమోదం కోసం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించాయి. ఎన్సీఎల్టీ సూచనల మేరకు ఐడియా వాటాదారుల సమావేశాన్ని నిర్వహించింది. తదుపరి దశలో టెలికాం శాఖ (డీవోటీ) అనుమతిని పొందాల్సి ఉంది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ కంపెనీలు విలీనానికి ఈ ఏడాది మొదట్లోనే అడుగులు పడిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలూ విలీనం జరిగితే 35 శాతం వాటాతో 23 బిలియన్ డాలర్ల విలువైన అతిపెద్ద కంపెనీగా అవతరించనుంది. ప్రస్తుతం వొడాఫోన్, ఐడియా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









