న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు ఖరారు
- October 14, 2017
స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాల లాంటి పెద్ద జట్లని ఓడించి మంచి హుషారులో ఉంది టీమిండియా. ఈ జోరులోనే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడబోతుంది. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం భారత జట్టుని ఎంపిక చేసింది బీసీఐ. ఈ సిరీస్ కు స్పన్నర్లు అశ్విన్, రవీంద్ర జడేజాలని ఎంపిక చేయలేదు. వారికి విశ్రాంతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఓపెనర్ కె ఎల్ రాహుల్ ని కూడా ఎంపిక చేయలేదు. అయితే, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ కు దూరంపెట్టిన రహానె ని తిరిగి జట్టులోకి తీసుకొనారు.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడబోతున్న భారత జట్టు ఇదే.. విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అజింక్యా రహానె, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఆక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చాహెల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, శార్దుల్ ఠాకూర్.
న్యూజిలాండ్ టీమ్తో ఇండియా మొత్తం మూడు వన్డేలు ఆడనుంది. ఈ నెల 22న మొదటి వన్డే, 25న రెండో వన్డే, 29న మూడో వన్డే ఆడనుంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









