పాక్తో సరికొత్త బంధం
- October 15, 2017
వాషింగ్టన్: గత కొన్నేళ్లుగా పాకిస్తాన్.. అమెరికా నుంచి అమితమైన లబ్ధి పొందిందని, అయితే ప్రస్తుతం ఇరు దేశాలు తమ మధ్య సంబంధాలను సరికొత్తగా ప్రారంభిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. పాకిస్తానీ సేనలు హక్కానీ ఉగ్రవాద సంస్థ చెర నుంచి అమెరికన్–కెనెడియన్ కుటుంబాన్ని విడిపించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా నిఘా వర్గాలు అందించిన సమాచారంతో గురువారం పాకిస్తానీ సేనలు హక్కానీల నుంచి అమెరికా జాతీయురాలు కైతలాన్ కోలేమాన్, ఆమె భర్త జాషువా బోయ్లే, వారి ముగ్గురు పిల్లలను రక్షించాయి. 2012లో అఫ్గానిస్తాన్లో ఈ జంటను హక్కానీలు కిడ్నాప్ చేశారు. బందీలుగా ఉన్న సమయంలోనే వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ సాయం అందించడాన్ని గత ఆగస్టులో ట్రంప్ తప్పుపట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







