పూణే పేలుళ్ళ నిమిత్తం హైదరాబాద్ లో హై అలర్ట్
- October 15, 2017
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పేలుళ్లు సంభవించవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మాల్స్, ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు వంటివాటిని నిషేధించారు. నగరంలో నిషేధాజ్ఞలు వారంపాటు కొనసాగుతాయని సిపి మహేందర్రెడ్డి తెలిపారు. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్రోడ్డు నుంచి రాకపోకలు నిర్వహించే వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద నలుగురు, ఐదుగురు కలసి తిరగవద్దని, ప్రజలు గుమిగూడవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకైన్ డ్రైవ్తోపాటు నగరశివారుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి తెలిపారు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









