పూణే పేలుళ్ళ నిమిత్తం హైదరాబాద్ లో హై అలర్ట్
- October 15, 2017
కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా పేలుళ్లు సంభవించవచ్చని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. మాల్స్, ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించి, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు వంటివాటిని నిషేధించారు. నగరంలో నిషేధాజ్ఞలు వారంపాటు కొనసాగుతాయని సిపి మహేందర్రెడ్డి తెలిపారు. శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. ఔటర్ రింగ్రోడ్డు నుంచి రాకపోకలు నిర్వహించే వాహనాల తనిఖీ చేపట్టారు. హైదరాబాద్, సికిందరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ల వద్ద నలుగురు, ఐదుగురు కలసి తిరగవద్దని, ప్రజలు గుమిగూడవద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డ్రంకైన్ డ్రైవ్తోపాటు నగరశివారుల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్టు సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









