ఈ రోజే గుజరాత్‌లో ప్రధాని మోడీ బారి బహిరంగ సభ

- October 16, 2017 , by Maagulf
ఈ రోజే  గుజరాత్‌లో ప్రధాని మోడీ బారి బహిరంగ సభ

సొంతరాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని మోడీ మెగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో తిరిగి పాగా వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు చేపట్టిన గుజరాత్‌ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌కు సమీపంలోని భట్‌ గ్రామంలో కాసేపట్లో గుజరాత్‌ గౌరవ్‌ మహాసమ్మేళన్‌ ప్రారంభం కానుంది. బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రను చేపట్టామని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు. 

ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కూడా పాల్గొననున్నారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో 149 నియోజకవర్గాల మీదుగా గుజరాత్ గౌరవ యాత్ర కొనసాగించారు. మరోవైపు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానున్న క్రమంలో ఈ ర్యాలీ సందర్భంగా గుజరాతీలపై ప్రధాని వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట సర్కార్ల విజయాలను వివరించడంతో పాటు ఓటర్లకు భారీ తాయిలాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com