ఈ రోజే గుజరాత్లో ప్రధాని మోడీ బారి బహిరంగ సభ
- October 16, 2017
సొంతరాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోడీ మెగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో తిరిగి పాగా వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు చేపట్టిన గుజరాత్ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీనగర్కు సమీపంలోని భట్ గ్రామంలో కాసేపట్లో గుజరాత్ గౌరవ్ మహాసమ్మేళన్ ప్రారంభం కానుంది. బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రను చేపట్టామని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొననున్నారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో 149 నియోజకవర్గాల మీదుగా గుజరాత్ గౌరవ యాత్ర కొనసాగించారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో ఈ ర్యాలీ సందర్భంగా గుజరాతీలపై ప్రధాని వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట సర్కార్ల విజయాలను వివరించడంతో పాటు ఓటర్లకు భారీ తాయిలాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









