ఈ రోజే గుజరాత్లో ప్రధాని మోడీ బారి బహిరంగ సభ
- October 16, 2017
సొంతరాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోడీ మెగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో తిరిగి పాగా వేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. బీజేపీ నేతలు చేపట్టిన గుజరాత్ గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గాంధీనగర్కు సమీపంలోని భట్ గ్రామంలో కాసేపట్లో గుజరాత్ గౌరవ్ మహాసమ్మేళన్ ప్రారంభం కానుంది. బీజేపీ ప్రభుత్వ విజయాలను ప్రచారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా ఈ యాత్రను చేపట్టామని గుజరాత్ బీజేపీ నేతలు చెబుతున్నారు.
ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొననున్నారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో 149 నియోజకవర్గాల మీదుగా గుజరాత్ గౌరవ యాత్ర కొనసాగించారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో ఈ ర్యాలీ సందర్భంగా గుజరాతీలపై ప్రధాని వరాల జల్లు కురిపిస్తారని భావిస్తున్నారు. కేంద్ర, రాష్ర్ట సర్కార్ల విజయాలను వివరించడంతో పాటు ఓటర్లకు భారీ తాయిలాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







