నావంబెర్ లో విడుదలకు సిద్ధం అవుతున్న 'దండుపాళ్యం-3'
- October 17, 2017
బొమ్మాళి ఫేమ్ రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్పాండే, రవికాలే ప్రధాన పాత్రల్లో శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దండుపాళ్యం'. ఈ మూవీ తెలుగు, కన్నడ భాషల్లో ఘనవిజయం సాధించి మంచి కలెక్షన్లను వసూళ్లు చేసిన సంగతి తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్గా ఇటీవలే 'దండుపాళ్యం2' కూడా వచ్చింది. కాకపోతే మొదటి పార్ట్ సాధించినంత విజయం సెకండ్ పార్ట్ సాధించలేకపోయింది. అయినాగానీ ఇప్పుడు తాజాగా 'దండుపాళ్యం' సీక్వెల్స్లో భాగంగా 'దండుపాళ్యం-3' రాబోతుందని ప్రకటించారు చిత్ర యూనిట్.
ఇప్పటికే షూటింగ్ అంత పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలిపి దానికి సంబదించిన మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. శ్రీనివాస రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందిస్తుండగా రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మూడో పార్ట్ ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







