గుండెపోటులో మరణించిన రామ్‌సింగ్‌ యాదవ్‌

- October 18, 2017 , by Maagulf
గుండెపోటులో మరణించిన రామ్‌సింగ్‌ యాదవ్‌

మధ్యప్రదేశ్‌(శివ్‌పురి): శివ్‌పురి జిల్లా కొలారస్‌ విదాన్‌ సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ శాసనసభ్యులు రామ్‌సింగ్‌ యాదవ్‌(74) నేడు గుండెపోటులో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామ్‌సింగ్‌ యాదవ్‌కు గుండెపోటు రావడంతో ఆయనను హూటాహుటిన గ్వాలియర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారని జిల్లా కాంగ్రెస్‌ ప్రతినిధి హర్వర్‌సింగ్‌ రఘువంశీ తెలిపారు. 2013 అసెంబ్లీ ఎన్నికలల్లో కొలారస్‌ నుంచి రామ్‌సింగ్‌ యాదవ్‌ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఆయనను ఆభిమానులంతా 'దాదాజీ' అని ఆప్యాయంగా పిలుస్తుంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com