బ్లాక్ పాయింట్స్ రద్దు, ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 18, 2017
షార్జా పోలీసులు, ఎమిరేట్ పరిధిలో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 19 గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 18 వరకు జారీ చేసిన జరీమానాలకు ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు చెల్లించే అవకాశం ఉందని షార్జా పోలీసు వర్గాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాయి. అక్టోబర్ 18 వరకు విధించబడ్డ బ్లాక్ పాయింట్స్ కూడా రద్దవుతాయని షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ అల్ జెరి అల్ షమ్సి చెప్పారు. 50వ వార్షిక సెలబ్రేషన్స్ (ఆపరేషన్స్ విభాగం) నేపథ్యంలో ఈ ఆఫర్స్ ప్రకటించినట్లు షార్జా పోలీస్ వర్గాలు తెలిపాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్ సైట్ లేదా పోలీస్ స్టేషన్లలో జరీమానాలు చెల్లించడానికి అవకాశముంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









