బ్లాక్ పాయింట్స్ రద్దు, ట్రాఫిక్ జరీమానాల్లో 50 శాతం తగ్గింపు
- October 18, 2017షార్జా పోలీసులు, ఎమిరేట్ పరిధిలో ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ని ప్రకటించడం జరిగింది. అక్టోబర్ 19 గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అక్టోబర్ 18 వరకు జారీ చేసిన జరీమానాలకు ఇది వర్తిస్తుంది. డిసెంబర్ 31 వరకు చెల్లించే అవకాశం ఉందని షార్జా పోలీసు వర్గాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాయి. అక్టోబర్ 18 వరకు విధించబడ్డ బ్లాక్ పాయింట్స్ కూడా రద్దవుతాయని షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ అల్ జెరి అల్ షమ్సి చెప్పారు. 50వ వార్షిక సెలబ్రేషన్స్ (ఆపరేషన్స్ విభాగం) నేపథ్యంలో ఈ ఆఫర్స్ ప్రకటించినట్లు షార్జా పోలీస్ వర్గాలు తెలిపాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెబ్ సైట్ లేదా పోలీస్ స్టేషన్లలో జరీమానాలు చెల్లించడానికి అవకాశముంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు