భారతీయ శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ కు గూగుల్ గౌరవం
- October 19, 2017నోబెల్ బహుమతి పొందిన భారతదేశ ఖగోళ భౌతికశాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 107 జయంతిని పురస్కరించుకుని గూగుల్ డూడుల్ పెట్టింది. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకుగాను ఆయన నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ ఇండో-అమెరికన్ ఖగోళ భౌతికశాస్త్రవేత్త నక్షత్రాల్లోనూ పరిణామదశ ఉందన్న అంశాన్ని కనుగొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో లాహోర్లో 1910 అక్టోబర్ 19న ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ భౌతిక శాస్తవేత్త సీవీ రామన్కు ఈయన మేనల్లుడు.
మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో, అమెరికా వెళ్లే వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ(1936)లో చదివారు. అనంతరం చికాగో యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకు గాను 1983లో ఆయన్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో పరిశోధకుడిగా వ్యవహరిస్తున్న కాలంలో 'చంద్రశేఖర్ లిమిట్'గా పిలిచే తన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. నక్షత్రాలు అస్థిరత్వం కావని, వాటికవే నష్టపోయి తెల్లని మరుగుజ్జులుగా మారుతాయని తన పరిశోధనల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..