వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
- October 20, 2017
మనామా: ఓ డ్రైవర్, ఇద్దరు పాదచారులు మూడు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మనామా, జెబ్లాత్ హబ్షి మరియు సనాద్లలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కింగ్ ఫైసల్ హైవైపే రోడ్డు ప్రమాదం జరగ్గా, ఈ ఘటనలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముహర్రాక్ వైపు వెళుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తి సెహ్లా హైవే దాటుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. జెబ్లాత్ హబ్షిలో రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇస్తిక్లాల్ హైవేపై సనద్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పాదచారి ఒకరు మృతి చెందారు. వేగంగా దూసుకొస్తున్న వాహనం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







