వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
- October 20, 2017
మనామా: ఓ డ్రైవర్, ఇద్దరు పాదచారులు మూడు వేర్వేరు ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. మనామా, జెబ్లాత్ హబ్షి మరియు సనాద్లలో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కింగ్ ఫైసల్ హైవైపే రోడ్డు ప్రమాదం జరగ్గా, ఈ ఘటనలో బహ్రెయినీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ముహర్రాక్ వైపు వెళుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మరో ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తి సెహ్లా హైవే దాటుతుండగా ప్రాణాలు కోల్పోయాడు. జెబ్లాత్ హబ్షిలో రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇస్తిక్లాల్ హైవేపై సనద్ వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో పాదచారి ఒకరు మృతి చెందారు. వేగంగా దూసుకొస్తున్న వాహనం, రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్ వెలుపల ఉన్నవారి వీసాలకు పొడిగింపు లేదు..!!
- టికెట్ రీఫండ్ సర్వీస్ ప్రకటించిన లేబర్ మినిస్ట్రీ..!!
- అబ్షర్ పర్మిట్తో ఆరు కేటగిరీ వారికి మక్కాలోకి ప్రవేశం..!!
- ప్రాపర్టీ ధరలు, అద్దెలను 30% పెంచనున్న మెట్రో గోల్డ్ లైన్..!!
- అబుదాబి 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం..!!
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం









