ఉత్తరాంధ్రకు తప్పిన వాయు'గండం'
- October 20, 2017
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నిన్న రాత్రి పారాదీప్కు సమీపంలో తీరం దాటింది. ఇది.. చాంద్బలీకి పశ్చిమంగా 25 కిలోమీటర్ల దూరంతో భూమి పైన కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది..తూర్పు ఈశాన్యదిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణశాఖ అదికారులు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో చాల చోట్ల వర్షాలు కురుస్తాయని అన్నారు. అదే సమయంలో ఉత్తరకోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అన్నారు.. ఈ సమయంలో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అదికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!







