రోడ్డు ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి
- October 21, 2017
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదంలో 16 ఏళ్ళ బాలిక మృతి చెందింది. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని 42 ఏళ్ళ జోర్డానియన్ నడుపుతున్నారు. ఆ కారులో మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ ఉన్నపళంగా యూ టర్న్ తీసుకోవడంతో వాహనం కంట్రోల్ తప్పి ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో రక్తమోడిన బాలికను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద ఘటన గురించి తెలియగానే సంఘటనా స్థలానికి పోలీస్ పెట్రోల్స్ చేరుకున్నాయని, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించడం జరిగిందని రష్దియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ బిన్ సులేమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







