కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వల్ల 5వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్
- October 22, 2017
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్లో పరిశ్రమల స్థాపనకు 23 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తొలిదశలో వరంగల్లో 14 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఇతర ప్రాంతాల్లో 8 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో 5వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాం టు ఫ్యాషన్ స్లోగన్తో టెక్స్టైల్ పార్క్లో పనులు జరుగుతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నేతన్నల నుంచి తయారీ, కొనుగోలు నేరుగా చేస్తున్నామని, టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవబోతోందని, రకరకాల వస్త్ర ప్రదర్శనలకు వరంగల్ వేదిక కావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







