కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌ వల్ల 5వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్‌

- October 22, 2017 , by Maagulf
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌ వల్ల 5వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్‌

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపనకు 23 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తొలిదశలో వరంగల్‌లో 14 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఇతర ప్రాంతాల్లో 8 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో 5వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఫాం టు ఫ్యాషన్ స్లోగన్‌తో టెక్స్‌టైల్ పార్క్‌లో పనులు జరుగుతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నేతన్నల నుంచి తయారీ, కొనుగోలు నేరుగా చేస్తున్నామని, టెక్స్‌టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవబోతోందని, రకరకాల వస్త్ర ప్రదర్శనలకు వరంగల్ వేదిక కావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com