కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ వల్ల 5వేల మందికి ఉపాధి : మంత్రి కేటీఆర్
- October 22, 2017
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్లో పరిశ్రమల స్థాపనకు 23 కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఒప్పందాలు కుదుర్చుకుంది. మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ తొలిదశలో వరంగల్లో 14 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, ఇతర ప్రాంతాల్లో 8 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో 5వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఫాం టు ఫ్యాషన్ స్లోగన్తో టెక్స్టైల్ పార్క్లో పనులు జరుగుతాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నేతన్నల నుంచి తయారీ, కొనుగోలు నేరుగా చేస్తున్నామని, టెక్స్టైల్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా నిలవబోతోందని, రకరకాల వస్త్ర ప్రదర్శనలకు వరంగల్ వేదిక కావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









