మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్
- October 22, 2017
కువైట్ : సాబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక మద్యం కర్మాగారాన్ని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో అధికారులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు, ఆసియా దేశానికి చెందిన ఇరువురు ప్రవాసులు అరెస్టయ్యారు, మద్యంతో నింపిన 140 పీపాలు మరియు మద్యం తయారీ కోసం ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు.. పబ్లిక్ భద్రత వ్యవహారాల సహాయ కార్యదర్శి మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా ఈ సందర్భంగా మాట్లాడుతూ సబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసీయులు మద్యం చేస్తున్నారనే సమాచారం అందిందని దీంతో వీరిని పెట్టుకొనేందుకు ఒక ప్ర్రత్యేక భద్రతా బృందం ఏర్పడింది. వచ్చిన సమాచారంను నిర్ధారించుకొని , అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఫ్యాక్టరీ పై దాడి చేసి ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. మద్యం తయారీ గురించి ప్రశ్నించినప్పుడు, అనుమానితులు తాము స్థానికంగా తయారుచేసిన మద్యాన్ని తమ తమ కొనుగోలుదారులకు 8 నుంచి 10 కువైట్ దినార్ల ఖర్చుతో విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









