200,000 దిర్హామ్లకే ఫెరారీ కారు
- October 23, 2017
దుబాయ్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా 1.2 మిలియన్ దిర్హామ్ల విలువైన ఫెరారీ కారుని 200,000 దిర్హామ్లకే విక్రయించిన ఘటన వెలుగు చూసింది. అయితే ఆ కారుని డిస్మాండిల్ చేసి, కార్గో చేయాలనే ప్రయత్నంలో దొంగల ముఠా ఉండగానే పోలీసులు పట్టుకోవడం జరిగింది. యూరోప్కి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు తన కారు దొంగలింపబడినట్లు ఫిర్యాదు చేశారు. ఆ కారుని ఆఫ్రికాకి చెందిన ఓ వ్యక్తికి 55,000 దిర్హామ్లకే విక్రయించినట్లు దుబాయ్ పోలీస్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సూరి చెప్పారు. ఆఫ్రికన్ నిందితుడు, ఆ కారుని గ్యారేజ్కి తీసుకెళ్ళి, అక్కడినుంచి విదేశాలకు తరలించి, స్పేర్ పార్టులుగా ఆ కారుని అమ్మేందుకు యత్నించాడు. నిందితుడు యూఏఈకి విజిట్ వీసాపై వచ్చినట్లు తెలిపారు. కారు మాజీ ఓనర్, ఆ కారు వివరాలు నిందితులకు చెప్పడంతో, వ్యూహాత్మకంగా కారుని దొంగిలించేందుకు ముఠాగా ఏర్పడ్డారు. కారు అలాగే కారు ఓనర్ని ఈ ముఠా అనుసరిస్తూ, సమయం చూసి దాన్ని దొంగిలించారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







