అఫ్గాన్‌లో పుష్ట్‌ రోడ్‌ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై ఉగ్రదాడి

- October 25, 2017 , by Maagulf
అఫ్గాన్‌లో పుష్ట్‌ రోడ్‌ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై ఉగ్రదాడి

అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. మంగళవారం రాత్రి పుష్ట్‌ రోడ్‌ జిల్లాలో ఓ సైనిక శిబిరంపై అధునాతన ఆయుధాలతో వారు జరిపిన దాడిలో 9 మంది సైనికులు అమరులయ్యారు. మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. నాలుగు గంటల పాటు హోరాహోరీగా జరిగిన పోరులో ఉగ్రవాదులు ఫిరంగుల్ని కూడా ప్రయోగించారు. దాడి ముగిసిన వెంటనే అఫ్గాన్‌ యుద్ధవిమానాలు రంగంలో దిగి, 17 మంది ఉగ్రవాదులు మట్టుబెట్టాయి. మరో ఘటనలో ఇంకో సైనిక స్థావరంపై జరిగిన దాడిలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com