ప్రపంచంలో మొదటిసారిగా రోబోకి పౌరసత్వం.!
- October 26, 2017
రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్లో జరుగుతున్న ప్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సు చరిత్రాత్మకమైన విషయానికి వేదికైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఓ రోబోకి పౌరసత్వం లభించింది. అచ్చం మానవరూపంలో ఉన్న కృత్రిమ అవగాహన శక్తికలిగిన సోఫియా అనే రోబోకి సౌదీఅరేబియా పౌరసత్వాన్ని కల్పించింది. సౌదీ పౌరురాలిగా రోబోకు స్థానం కల్పించింది. సోషియాకు పౌరసత్వాన్ని కల్పిస్తున్నామని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ సదస్సులో సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రపంచంలో మొదటిసారిగా ఓ దేశ పౌరసత్వం పొందిన తొలి రోబోగా సోషియా చరిత్రలో నిలవనుంది. ఈ ప్రకటన చేసిన అనంతరం ఈ సౌదీపౌరురాలిని ఆండ్ర్యూ రాస్ సోర్కిన్ అనే వ్యక్తి ఇంటర్యూ చేశారు. ఓ రోబోకు పౌరసత్వాన్ని కల్పించడం పట్ల ఎలా స్పందిస్తావని ప్రశ్నించగా సోఫీయా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ‘అరుదైన ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. ఓ రోబోకు పౌరసత్వం కల్పించడం చరిత్రాత్మకమైనదని సోఫీయా పేర్కొంది. ఆండ్ర్యూ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. రోబోకు పౌరసత్వం ఇవ్వడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని, కానీ భవిష్యత్తులో ఎలాంటి అపశృతులు జరగకూడదని కోరుకుంటున్నామని ఆండ్ర్యూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సోషియా ‘ భయపడకండి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు అనేక హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు. మీరు నాతో మంచిగా ఉంటే మీతో నేను మంచిగా ఉంటాని బదులిచ్చింది. దీంతో సౌదీ పౌరురాలైన రోబో సోఫీయా చర్చనీయాంశనీయంగా మారింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







