శంషాబాద్ లో ఆగివున్న విమానం నుంచి జారిపడ్డ ఎయిర్హొస్టెస్
- October 26, 2017
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(శంషాబాద్)లో ఆగి ఉన్న ఓ విమానం నుంచి ఎయిర్హోస్టెస్ జారి పడింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం చోటుచేసుకొంది.
విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మస్కట్ నుంచి ఒమన్ ఎయిర్ లైన్స్ విమానం గురువారం మధ్యాహ్నం 1.40గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైంది. అనంతరం విమానం పార్కింగ్ స్థలానికి చేరుకుంది.
ప్రయాణికులు ఎక్కేందుకు విమానాన్ని సిద్ధం చేస్తుండగా అందులో ఉన్న ఓ ఎయిర్హొస్టెస్ ప్రమాదవశాత్తు విమానం ప్రవేశ ద్వారం వద్ద నుంచి జారి పడింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్టులోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







