విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!

- October 27, 2017 , by Maagulf
విశాఖ ఎయిర్ పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్.!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి బంగారం కలకలం సృష్టించింది. కొలంబో నుంచి కడుపులో బంగారంతో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌ దిగిన షరీపుద్దీన్‌ మహ్మద్‌ అనే వ్యక్తిని కస్టమ్స్‌ అదికారులు అదుపులోకి తీసుకున్నారు. మెటల్‌ డిటెక్టర్లతో చెక్‌ చెయ్యడంతో కడుపులో రెండు బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అదికారులు గుర్తించారు. కడుపులో ఉన్న బంగారు బిస్కెట్లను బయటకు తీసేందుకు మహ్మద్‌ను కేజీహెచ్‌కు తరలించారు.. ఇదే..శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానంలోఅబ్బీన్‌ అనే మహిళ 88 గ్రాముల బంగారు ఆభరణాలతో కస్టమ్స్‌ అదికారులకు దొరికింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని అదికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com