యూఏఈ ఎయిర్పోర్టుల్లో పొగమంచు
- October 27, 2017నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా నెలకొంటోందని పేర్కొంది. దుబాయ్, షార్జా, అబుదాబీ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కన్పిస్తోంది. ఖలీఫా కాలేజ్, దుబాయ్లోని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు ఝాము నుంచీ పొగమంచు విపరీతంగా నమోదైంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా నమోదు కానుంది. పగటి పూట వాతావరణం బాగానే ఉంటుందనీ, ఒక్కోసారి పాక్షికంగా మేఘావృతం అవడం జరుగుతుంటుందని ఎన్సిఎంఎస్ పేర్కొంది. మేఘాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా సాయంత్రం వేళ మేఘాలు దర్శనమిస్తాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు గాలులు వీయనున్నాయి. రాత్రి వేళలో హ్యుమిడిటీ శాతం పెరగనుంది. ఉష్ణోగ్రతలు 36 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. హ్యుమిడిటీ లెవల్స్ అత్యధికంగా 95 శాతం వరకు ఉంటాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు