యూఏఈ ఎయిర్పోర్టుల్లో పొగమంచు
- October 27, 2017
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, పొగమంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా నెలకొంటోందని పేర్కొంది. దుబాయ్, షార్జా, అబుదాబీ ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కన్పిస్తోంది. ఖలీఫా కాలేజ్, దుబాయ్లోని అల్ మక్తౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారు ఝాము నుంచీ పొగమంచు విపరీతంగా నమోదైంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ 1000 మీటర్ల కంటే తక్కువగా నమోదు కానుంది. పగటి పూట వాతావరణం బాగానే ఉంటుందనీ, ఒక్కోసారి పాక్షికంగా మేఘావృతం అవడం జరుగుతుంటుందని ఎన్సిఎంఎస్ పేర్కొంది. మేఘాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా సాయంత్రం వేళ మేఘాలు దర్శనమిస్తాయి. సాధారణం నుంచి ఓ మోస్తరు గాలులు వీయనున్నాయి. రాత్రి వేళలో హ్యుమిడిటీ శాతం పెరగనుంది. ఉష్ణోగ్రతలు 36 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. హ్యుమిడిటీ లెవల్స్ అత్యధికంగా 95 శాతం వరకు ఉంటాయి. ఆది, సోమవారాల్లోనూ ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







