ఎయిర్పోర్టుల్లో ఇకపై మొబైల్ ఆధార్
- October 28, 2017
విమానాశ్రయంలో ప్రవేశానికి ఇకపై గుర్తింపు కార్డుగా మొబైల్ ఆధార్ (ఆధార్ యాప్)ను ఇకపై వినియోగించుకోవచ్చు. ఈ మేరకు విమానయాన భద్రతా విభాగం బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు తల్లిదండ్రులతో పాటు వెళ్లే మైనర్లకు గుర్తింపు కార్డు చూపడం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఎయిర్పోర్టులో ప్రవేశానికి బీసీఏఎస్ ఇటీవల కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పాస్పోర్టు, ఓటర్ ఐడీ, ఆధార్ లేదా ఎం-ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డును చూపడం ద్వారా విమానాశ్రయంలో ప్రవేశం పొందొచ్చని పేర్కొంది. వీటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంక్ జారీ చేసిన పాస్బుక్, పెన్షన్ కార్డు, దివ్యాంగ గుర్తింపు కార్డుతో పాటు, సర్వీస్ ఐడీని కూడా గుర్తింపుగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ప్రయాణికులు పై గుర్తింపు కార్డుల్లో ఏదైనా సమర్పించలేనప్పుడు గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన ధ్రువీకరణ పత్రాన్ని చూపించినా సరిపోతుందని తాజా మార్గదర్శకాల్లో బీసీఏఎస్ పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణికులు మాత్రం తమ పాస్పోర్టుతో పాటు, విమాన టికెట్ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









