బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి
- October 28, 2017
బహ్రెయిన్ : శుక్రవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలపాలయ్యారుబహ్రెయిన్లో ఒక పోలీసు బస్సు శుక్రవారం మనామా వైపు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు గాయపడిన పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు. . మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు బాంబుతో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు బస్సుపై బాంబులని గురి చూసి విసిరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు నివేదించిన తరువాత సంబంధిత అధికారులు నేరస్థుడిని మరియు వాటిని న్యాయస్థానానికి తీసుకురావడానికి, ఈ దాడి వెనుక ఉన్న తీవ్రవాద నేరాలలో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించబడింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి ఈ కేసు మళ్ళించబడింది.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







