హై కోర్ట్ తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలి : రాంనాథ్ కోవింద్
- October 28, 2017
దేశంలో హైకోర్టులు ఇచ్చే తీర్పులను ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారు. శనివారం జరిగిన కేరళ హైకోర్టు వజ్రోత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టులు ప్రజలకు న్యాయమై తీర్పులు ఇవ్వడమే కాదు.. వారికి అర్థమయ్యే భాషలోనూ వాటిని అందుబాటులో ఉంచాలని సూచించారు.
'మన దేశంలో ఎన్నో భాషలున్నాయి. న్యాయస్థానాలు ఇంగ్లీషులో తీర్పు ఇవ్వడం వల్ల ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకోలేరు. అందువల్ల న్యాయవాదులు, ఇతర వ్యక్తులను సంప్రదించాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతుంది' అని రాష్ట్రపతి అన్నారు.
'కేసుల విచారణలో జాప్యం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ముఖ్యమైన కేసుల విచారణలో వాయిదాలను నివారించి వీలైనంత త్వరగా కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలి' అని కోవింద్ సూచించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నవనీతి ప్రసాద్ సింగ్, కేరళ గవర్నర్ పి.సదాశివం తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







