చెన్నై-బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా నౌక సేవలు ప్రారంభించిన నితిన్‌ గడ్కరీ

- October 28, 2017 , by Maagulf
చెన్నై-బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా నౌక సేవలు ప్రారంభించిన నితిన్‌ గడ్కరీ

చెన్నై- బంగ్లాదేశ్‌ల మధ్య సరకు రవాణా (కార్గో) నౌక సేవలను కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శనివారం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతంలో బంగ్లాదేశ్‌లో పర్యటించినప్పుడు రెండు దేశాల మధ్య కార్గో నౌక రవాణాకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చెన్నై ఓడరేవు నుంచి బంగ్లాదేశ్‌ మోన్లా ఓడరేవుకు అశోక్‌ లేలాండ్‌ సంస్థ మొట్టమొదటిగా 185 లారీలను ఈ నౌక ద్వారా శనివారం పంపింది. దీన్ని మంత్రి నితిన్‌ గడ్కరీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com