పార్టీ నేతలతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా

- October 29, 2017 , by Maagulf
పార్టీ నేతలతో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కుంతియా

వంత్‌రెడ్డితో పాటు ఇతర పార్టీల నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుంతియా వెల్లడించారు. వీరిలో కొందరు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో సమావేశమయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన కుంతియాకు ఆ పార్టీ నేతలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం పలికారు.

రేవంత్‌ రెడ్డి... ఈనెల 31న కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని  పార్టీ నేతలతో సమావేశమైన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా దీనిపై స్పష్టత ఇచ్చారు. పార్టీలో ఆయనకు ఏ పదవులు ప్రస్తుతానికి ఇవ్వడం లేదని బేషరుత్తుగానే పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ నేతలెవరూ రేవంత్‌ రాకను వ్యతిరేకించడం లేదన్నారు. మాజీ మంత్రి డీకే అరుణ కూడా రేవంత్‌ రాకపై అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com