కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త
- October 29, 2017
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేశాఖ 15 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి కొత్తగా పదివేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆగస్టు నెలలో రైల్వేశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ అదనపు పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పెంచుతామని ప్రకటించారు. ముంబైలో రైల్వేమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో రైల్వేలైన్ల విద్యుదీకరణను వేగిరం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పదేళ్లలో చేయాలనుకున్న విద్యుదీకరణ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయడం ద్వారా 30 శాతం వ్యయాన్ని తగ్గిస్తామన్నారు. విద్యుదీకరణ ప్రాజెక్టుల వల్ల ఏటా పదివేల కోట్ల రూపాయల ఇంధన వ్యయాన్ని రైల్వేకు తగ్గించవచ్చన్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







