కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త
- October 29, 2017
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రైల్వేశాఖ 15 వేల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టి కొత్తగా పదివేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు. ఆగస్టు నెలలో రైల్వేశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పీయూష్ గోయల్ మాట్లాడుతూ అదనపు పెట్టుబడులతో ఉపాధి అవకాశాలు పెంచుతామని ప్రకటించారు. ముంబైలో రైల్వేమంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దేశంలో రైల్వేలైన్ల విద్యుదీకరణను వేగిరం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పదేళ్లలో చేయాలనుకున్న విద్యుదీకరణ ప్రాజెక్టులను నాలుగేళ్లలో పూర్తి చేయడం ద్వారా 30 శాతం వ్యయాన్ని తగ్గిస్తామన్నారు. విద్యుదీకరణ ప్రాజెక్టుల వల్ల ఏటా పదివేల కోట్ల రూపాయల ఇంధన వ్యయాన్ని రైల్వేకు తగ్గించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!







