అరుణాచల్ ప్రదేశ్లోని చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది
- October 29, 2017
మంచుకొండల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు సరుకులు తీసుకెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్యంగా కుప్పకూలడం వెనుక కారణాలు బయటపడ్డాయి. చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు..
అక్టోబర్ 6న ఉదయాన్నే 6 గంటలకు.. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి వెళ్లింది Mi 17 వీ ఫైవ్... హెలికాప్టర్. 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. కొండలపై ఉన్న సైనిక శిబిరాల దగ్గర కిరోసిన్ క్యాన్లను ప్యారాచూట్ల సాయంతో కిందకు విడిచింది. ఈ సమయంలో ఓ కిరోసిన్ క్యాన్ ప్యారాచూట్.. హెలికాప్టర్ టెయిల్ రూటర్కు తట్టుకుంది. దీంతో రూటర్ జామ్ అయ్యి.. హెలికాప్టర్ కిందకు కూలిపోయింది.
సాధారణంగా సరుకులను కిందకు దించే సమయంలో హెలికాప్టర్ను ఓ ప్రాంతంలో నిలిపి కిందకు వేస్తుంటారు. కానీ.. తవాంగ్లో మాత్రం వేగంగా ముందుకు సాగుతూ క్యాన్లను కిందకు విసిరారు. వేగంగా గాలులు వీయడంతో.. ఓ ప్యారాచూట్.. హెలికాప్టర్ తోకకు తగలడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అంతా చూస్తుండగానే.. కొండల్లో కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







