అరుణాచల్ ప్రదేశ్లోని చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది
- October 29, 2017
మంచుకొండల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు సరుకులు తీసుకెళ్లిన ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్యంగా కుప్పకూలడం వెనుక కారణాలు బయటపడ్డాయి. చిన్న నిర్లక్ష్యం.. ఏడుగురి ప్రాణాలను బలితీసుకోవడం చూసి అధికారులు అవాక్కయ్యారు..
అక్టోబర్ 6న ఉదయాన్నే 6 గంటలకు.. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతానికి వెళ్లింది Mi 17 వీ ఫైవ్... హెలికాప్టర్. 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ.. కొండలపై ఉన్న సైనిక శిబిరాల దగ్గర కిరోసిన్ క్యాన్లను ప్యారాచూట్ల సాయంతో కిందకు విడిచింది. ఈ సమయంలో ఓ కిరోసిన్ క్యాన్ ప్యారాచూట్.. హెలికాప్టర్ టెయిల్ రూటర్కు తట్టుకుంది. దీంతో రూటర్ జామ్ అయ్యి.. హెలికాప్టర్ కిందకు కూలిపోయింది.
సాధారణంగా సరుకులను కిందకు దించే సమయంలో హెలికాప్టర్ను ఓ ప్రాంతంలో నిలిపి కిందకు వేస్తుంటారు. కానీ.. తవాంగ్లో మాత్రం వేగంగా ముందుకు సాగుతూ క్యాన్లను కిందకు విసిరారు. వేగంగా గాలులు వీయడంతో.. ఓ ప్యారాచూట్.. హెలికాప్టర్ తోకకు తగలడంతో.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అంతా చూస్తుండగానే.. కొండల్లో కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు సిబ్బంది ప్రాణాలను బలితీసుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







