బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- October 30, 2017
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. శ్రీలంక తీరానికి నైరుతి దిశగా మయన్మార్ సమీపంలో రేపటి వరకు ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదిలే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు దీని దశను చెప్పలేమన్నారు వాతావరణ అధికారులు. రెండు, మూడు రోజుల్లో అల్పపీడన పయనంపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు తెలంగాణలో పగలు పొడి వాతావరణం ఏర్పడుతోంది. గాలిలో తేమ శాతం తగ్గడమే దీనికి కారణం. ఇక పగటి పూట మేఘాలు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి త్వరగా వేడెక్కుతోందని అధికారులు చెప్పారు.
మరోవైపు ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి చెన్నైతో సహా పలు కోస్తా జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదలడంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకరించకపోవడంతో సుమారు 25 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇవాళ కూడా చెన్నైతో పాటు రాష్ట్రంలోని ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. మరో ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, నాగపట్నం జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇవాళ ప్రకటించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







