బార్సిలోనాలోని రైల్వే స్టేషన్లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రం
- October 30, 2017
హిందువులు పరమ పవిత్రంగా జపించే గాయత్రీ మంత్రం అక్కడి వారిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. గాయత్రీ మంత్రంలోని ప్రతీ అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. మరి అంతటి మహిమగల మంత్రాన్ని స్పెయిన్లోని అతిపెద్ద నగరం బార్సిలోనాలోని రైల్వే స్టేషన్లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రాన్ని లయబద్దంగా ఆలపిస్తుంటారు. ఇక్కడి మెట్రో రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ పాస్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్లోనే ఈమె కూర్చుని భక్తితో ఆలపించే గాయత్రీ మంత్రాన్ని అటుగా వెళ్లే ప్రయాణీకులు విని ఆనందిస్తూ ఆమెకు సవినయంగా నమస్కరిస్తుంటారు. కొందరు ఆమెతో పాటు ఆలపిస్తూ వెళుతుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కోట్లమంది అభిమానులను చూరగొంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







