బార్సిలోనాలోని రైల్వే స్టేషన్లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రం
- October 30, 2017
హిందువులు పరమ పవిత్రంగా జపించే గాయత్రీ మంత్రం అక్కడి వారిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. గాయత్రీ మంత్రంలోని ప్రతీ అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. మరి అంతటి మహిమగల మంత్రాన్ని స్పెయిన్లోని అతిపెద్ద నగరం బార్సిలోనాలోని రైల్వే స్టేషన్లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రాన్ని లయబద్దంగా ఆలపిస్తుంటారు. ఇక్కడి మెట్రో రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్కి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ పాస్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్లోనే ఈమె కూర్చుని భక్తితో ఆలపించే గాయత్రీ మంత్రాన్ని అటుగా వెళ్లే ప్రయాణీకులు విని ఆనందిస్తూ ఆమెకు సవినయంగా నమస్కరిస్తుంటారు. కొందరు ఆమెతో పాటు ఆలపిస్తూ వెళుతుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కోట్లమంది అభిమానులను చూరగొంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







