నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు 300 విమాన సర్వీసులను రద్దు చేసిన ఢిల్లీ విమానాశ్రయం
- October 31, 2017
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక అంటూ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల (నవంబరు) 7 నుంచి మూడురోజుల పాటు ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందున 30 శాతం విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో గంటకు 67 విమానాలు వచ్చిపోతుంటాయి. కాని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందు వల్ల గంటకు వచ్చి పోయే విమానాల సంఖ్యను 45కు తగ్గించామని అధికారులు పేర్కొన్నారు. నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు దాదాపు 300 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీకి వచ్చి పోయే విమాన ప్రయాణికులు గమనించాలని విమానాశ్రయ అధికారులు కోరారు. విమానాశ్రయంలో మరమ్మతు పనుల వల్ల కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్ వేస్ లు ఇప్పటికే ప్రకటించాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







