దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్ విజేతలు వీళ్ళే
- October 31, 2017తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ డ్రాలో ఇద్దరు విజేతలు చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇందులో జపాన్కి చెందిన 47 ఏళ్ళ యజునోబు యమద 255 సిరీస్లో 2024 టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఈ బహుమతి గెల్చుకున్న రెండో జపనీయుడు కావడం గమనించదగ్గ విషయం. ఇది తనకు దుబాయ్లో రెండో ట్రిప్ అనీ, ఈ రెండో ట్రిప్ తనను ఇంతటి ధనవంతుడ్ని చేస్తుందనుకోలేదని యమద చెప్పారు. మరో లక్కీ విన్నర్ దుబాయ్లోని భారతీయుడు సంతోష్ విజయన్. 50 ఏళ్ళ సంతోష్ విజయన్ కూడా 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. దుబాయ్లో 27 ఏళ్ళుగా నివసిస్తున్న సంతోష్ విజయన్, అబుదాబీలోని ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి. నవంబర్ 11న తాను 51వ పుట్టినరోజు జరుపుకోనున్నాననీ, ఇది తనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటానని విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..