వరంగల్ పార్లమెంట్ స్థానానికి 23 మంది అభ్యర్థులు
- November 07, 2015
వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి రోజైన శనివారం 8 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు పసునూరి దయాకర్ (టీఆర్ఎస్), సర్వే సత్యనారాయణ (కాంగ్రెస్), నల్లా సూర్యప్రకాశరావు (వైఎస్సార్సీపీ), దేవయ్య (ఎన్డీఏ) , వినోద్ కుమార్ (వామపక్షాలు) పోటీపడుతున్నారు. మొత్తానికి ఈ నియోజకవర్గంలో బహుముఖ పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన విజయరామారావు, కొండేటి శ్రీధర్, రాజారపు ప్రతాప్, బొచ్చు సమ్మయ్య నామినేషన్ ఉపసంహరించుకున్న వారిలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య.. కోడలు, మనవళ్ల మృతి నేపథ్యంలో పోటీ నుంచి వైదొలగిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









