రసాయనాల ఘాటు: 55 మందికి అనారోగ్యం
- November 01, 2017
షార్జా: షార్జాలోని ఓ ప్లాంట్లో రసాయనాల ఘాటు కారణంగా 55 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ బీయా ఈ ప్లాంట్ని నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ప్లాంట్కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 55 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయగా, ఒకరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కువైట్ హాస్పిటల్ ఎమర్జన్సీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఐసా అల్ మోవాలమి మాట్లాడుతూ, 12 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ, ముగ్గురు నేపాలీ కార్మికుల్ని ఆసుపత్రికి తీసుకువచ్చారనీ, వారిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు. గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలాగే శ్వాస పీల్చడంలో ఇబ్బందులతో వారు ఆసుపత్రికి వచ్చినట్లు అల్ మోవాలమి చెప్పారు. కెమికల్స్ని మిక్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







