రసాయనాల ఘాటు: 55 మందికి అనారోగ్యం

- November 01, 2017 , by Maagulf
రసాయనాల ఘాటు: 55 మందికి అనారోగ్యం

షార్జా: షార్జాలోని ఓ ప్లాంట్‌లో రసాయనాల ఘాటు కారణంగా 55 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ బీయా ఈ ప్లాంట్‌ని నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ప్లాంట్‌కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 55 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ చేయగా, ఒకరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కువైట్‌ హాస్పిటల్‌ ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ ఐసా అల్‌ మోవాలమి మాట్లాడుతూ, 12 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ, ముగ్గురు నేపాలీ కార్మికుల్ని ఆసుపత్రికి తీసుకువచ్చారనీ, వారిని డిశ్చార్జ్‌ చేశామని చెప్పారు. గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలాగే శ్వాస పీల్చడంలో ఇబ్బందులతో వారు ఆసుపత్రికి వచ్చినట్లు అల్‌ మోవాలమి చెప్పారు. కెమికల్స్‌ని మిక్స్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com