రసాయనాల ఘాటు: 55 మందికి అనారోగ్యం
- November 01, 2017
షార్జా: షార్జాలోని ఓ ప్లాంట్లో రసాయనాల ఘాటు కారణంగా 55 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ బీయా ఈ ప్లాంట్ని నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. ప్లాంట్కి సంబంధించిన వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 55 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేయగా, ఒకరు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కువైట్ హాస్పిటల్ ఎమర్జన్సీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ ఐసా అల్ మోవాలమి మాట్లాడుతూ, 12 మంది భారతీయులు, ఒక పాకిస్తానీ, ముగ్గురు నేపాలీ కార్మికుల్ని ఆసుపత్రికి తీసుకువచ్చారనీ, వారిని డిశ్చార్జ్ చేశామని చెప్పారు. గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అలాగే శ్వాస పీల్చడంలో ఇబ్బందులతో వారు ఆసుపత్రికి వచ్చినట్లు అల్ మోవాలమి చెప్పారు. కెమికల్స్ని మిక్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









