'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 9వ వార్షికోత్సవ వేడుకలు

- November 07, 2015 , by Maagulf

నవంబర్ 6న శుక్రవారం సాయంత్రం నుండి రాత్రి వరకు 'దుబాయ్ తెలుగు క్రైస్తవ సంఘం' ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవంను ఘనంగా జెమ్స్ ప్రైవేటు స్కూల్ ఆడిటోరియంలో ఈ వేడుకను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి దైవ వర్తమానికులు పి.ఏ స్వామి  గారు భారత్ దేశం నుండి వచ్చారు . ఈ కార్యక్రమము లో వక్తలు మాట్లాడారు అలాగే వంద లాది తెలుగు వారు పాల్గొని దేవునికి ప్రార్ధనలు చేసారు. ఈ కార్యక్రమము లో చర్చి పెద్దలు పాస్టర్ సి.హెచ్ శ్యాం బాబు  గారు, శాలెం బాబు గారు,అనిల్ కుమార్ గారు,రమణ మూర్తి  గారు తదితరులు పాల్గున్నారు.

ఈ కార్యక్రమములో శాలెం బాబు గారి కుమారుడు డేవిడ్ డెంజెల్(చెర్రీ) తన నృత్యం తో అందరికి ఆకట్టుకున్నాడు.వంద లాది మంది తెలుగు చర్చి లో పాల్గుని ప్రార్ధనలు చేసారు, అలాగే దేవుని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమము ఆద్యంతం కన్నుల పండుగగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాము.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com