ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- April 29, 2024న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ దశలో బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది. బిహార్ లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.
దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత