చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- April 29, 2024చెన్నై: ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నకు అర్హత సాధించిన దొమ్మరాజు గుకేష్ కు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందజేశారు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ చెన్నై టీనేజర్ వరల్డ్ చాంపి యన్షిప్నకు క్వాలిఫై అయిన పిన్నవయస్సు ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
గుకేష్ తన తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో స్టాలిన్ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గుకేష్ ను శాలువతో సత్కరించి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున అతడికి రూ. 75 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో క్రీడామంత్రి ఉదయనిధి కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ