చెస్ రారాజుకు న‌గ‌దు పుర‌స్కారం…

- April 29, 2024 , by Maagulf
చెస్ రారాజుకు న‌గ‌దు పుర‌స్కారం…

చెన్నై: ప్రపంచ చెస్‌ ఛాంపియన్షిప్ నకు అర్హత సాధించిన దొమ్మరాజు గుకేష్ కు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అందజేశారు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ చెన్నై టీనేజర్‌ వరల్డ్‌ చాంపి యన్‌షిప్‌నకు క్వాలిఫై అయిన పిన్నవయస్సు ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

గుకేష్‌ తన తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో స్టాలిన్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గుకేష్ ను శాలువతో సత్కరించి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున అతడికి రూ. 75 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో క్రీడామంత్రి ఉదయనిధి కూడా పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com