గిన్నిస్ రికార్డు కోసం గరిట తిప్పిన బాబా రాందేవ్
- November 04, 2017కిచిడీని జాతీయ వంటకంగా ప్రకటించే అవకాశం ఉందంటూ వచ్చిన వార్తల్ని పక్కన పెట్టి, ఇప్పుడు గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడానికి కిచిడీ సిద్దమవుతోంది. ఢిల్లీ వేదికగా 'వరల్డ్ ఫుడ్ ఇండియా కాన్ఫరెన్స్' మూడురోజుల సదస్సులో భాగంగా ప్రముఖ పాక శాస్త్రనిపుణుడు సంజవ్ కపూర్ ఆధ్వర్యంలో కిచిడీని తయారు చేస్తున్నారు. 60,000 మంది అనాథ పిల్లలకు, సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన 60 దేశాలకు చెందిన ప్రతినిధులకు ఈ కిచిడీని వడ్డిస్తారు. ఇందుకు గాను 800 కేజీల ధాన్యాలతో బ్రాండ్ ఇండియా కిచిడీని తయారు చేస్తున్నారు. కిచిడీ తయారీ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హర్సిమ్రత్ కౌర్, సాధ్వీ నిరంజన్, యోగా గురువు బాబా రాందేవ్లు కూడా హాజరయ్యి వారు కూడా గరిట తిప్పారు.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత