ఉద్దరించాల్సిన ఉపాధ్యాయులే...కీచకులైతే ?
- November 06, 2017
కువైట్ : చదువులు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు చవకబారు వేషాలు వేశారు. ఫలితంగా జైలుశిక్ష, దేశ బహిష్కరణకు గురయ్యారు.ఈజిప్ట్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కువైట్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అల్ రాయ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు. ఓ నిందితుడు మహిళను వేధించగా మరో వ్యక్తి బాలికను సతాయించాడు. సిబ్బంది వీరి చేష్టలను గమనించడంతో నెమ్మదిగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. బాధితుల సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు తీర్పువెలువరించింది. నిందితులిద్దరినీ దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. కేసు విచారణ సమయంలో నిందితులు న్యాయస్థానంలో తాము ఎటువంటి నేరం చేయలేదని అడ్డం తిరిగేరు. తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని అబద్దాలు ఆదెరు . కానీ దుకాణంలో ఉన్న సీసీ కెమేరాలో వారు చేసిన వెకిలిచేష్టలు రికార్డైన దృశ్యాలు చూపించడంతో ఇద్దరూ నిందితులు నోరుమూశారని పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ మేజర్ జనరల్ ఇబ్రహిం అల్ తరహ్ తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







