ఉద్దరించాల్సిన ఉపాధ్యాయులే...కీచకులైతే ?
- November 06, 2017
కువైట్ : చదువులు చెప్పాల్సిన ఆ ఉపాధ్యాయులు చవకబారు వేషాలు వేశారు. ఫలితంగా జైలుశిక్ష, దేశ బహిష్కరణకు గురయ్యారు.ఈజిప్ట్ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కువైట్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అల్ రాయ్ ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు. ఓ నిందితుడు మహిళను వేధించగా మరో వ్యక్తి బాలికను సతాయించాడు. సిబ్బంది వీరి చేష్టలను గమనించడంతో నెమ్మదిగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. బాధితుల సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు తీర్పువెలువరించింది. నిందితులిద్దరినీ దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. కేసు విచారణ సమయంలో నిందితులు న్యాయస్థానంలో తాము ఎటువంటి నేరం చేయలేదని అడ్డం తిరిగేరు. తాము ఎలాంటి నేరానికి పాల్పడలేదని అబద్దాలు ఆదెరు . కానీ దుకాణంలో ఉన్న సీసీ కెమేరాలో వారు చేసిన వెకిలిచేష్టలు రికార్డైన దృశ్యాలు చూపించడంతో ఇద్దరూ నిందితులు నోరుమూశారని పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ మేజర్ జనరల్ ఇబ్రహిం అల్ తరహ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







