కారు ప్రమాదం: అగ్నికి ఆహుతైన వ్యక్తి
- November 06, 201720 ఏళ్ళ అరబ్ వ్యక్తి ఒకరు, కారు ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యారు. కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. షార్జాలోని మ్లీహా రోడ్డులో సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ అబ్దుల్ రహ్మాన్ ఖతెర్ మాట్లాడుతూ, కారు టైరు పేలిన వెంటనే, అదుపు తప్పిన కారు సిమెంట్ బ్యారియర్ని ఢీకొన్నట్లు చెప్పారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వెంటనే, మంటలు వ్యాపించాయి. రెస్క్యూ సిబ్బంది సమాచారం అందుకుని, ఘటనా స్థలానికి చేరుకునేటప్పటికే, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మంటల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాన్ని 'మార్గ్యు'కి తరలించారు. కారుకి అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని వీడియోగా చిత్రీకరించి కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. ఈ తరహా వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ