లక్ష మందికి ఐటీ నోటీసులు అందనున్నాయి
- November 07, 2017
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు జమ చేసిన దాదాపు లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించనున్నారు. ఈ వారంలోనే వాళ్లందరికీ నోటీసులు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.50లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసిన 70వేల మందికి మొదటగా నోటీసులు అందనున్నాయి. ఐటీ యాక్ట్ సెక్షన్ 142(1) కింద ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వారి గత ప్రవర్తనను పరిశీలనలోకి తీసుకుని మరో 30వేల మందికి కూడా ఈ నోటీసులు అందనున్నాయి. రూ.25లక్షల నుంచి రూ.50లక్షల మధ్య నగదు డిపాజిట్లు చేసిన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగానే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







