భారత్లో మతస్వేచ్ఛ లేదు అని అమెరికా సంచలన ప్రకటన
- November 09, 2017
భారత్లో మతస్వేచ్ఛ కరువైందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయని.. మతస్వేచ్ఛ కోసం ఐదు లక్షల డాలర్ల నిధులను అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ రిపోర్టు ప్రకారం శ్రీలంక, భారత దేశాల్లో మస్లింలు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అమెరికా ఆరోపించింది.
ఈ జాబితాలో భారత్కు స్థానం లేకున్నా భారత్కు నిధులు అందజేయాలని అమెరికా నిర్ణయించడం ఆశ్చర్యకరమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, నేపాల్, పాకిస్తాన్, తజకిస్థాన్, తుర్కుమెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాలు ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.
ఇక భారత్లో రిలిజియస్ ఫ్రీడమ్ కోసం ప్రభుత్వేతర సంస్థలకు అంటే ఎన్జీవోలకు ఈ నిధులను అందజేస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. దక్షిణ, మధ్య ఆసియా దేశాల్లో మానవహక్కుల ఉల్లంఘన, కార్మికుల రక్షణ తదితర 28 అంశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







