ఐరన్ దొంగల పట్టివేత: ఇద్దరు పోలీసులకు సన్మానం
- November 10, 2017
ఐరన్ దొంగల ముఠాని పట్టుకోవడంలో తెగువ చూపినందుకుగాను ఇద్దరు పోలీసు అధికారులను దుబాయ్ పోలీస్ సన్మానించింది. దుబాయ్లోని అల్ రషిదియా పోలీస్ స్టేషన్ యాక్టింగ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ సలె అల్ షెహ్హి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాద్ ఖయెద్ అల్ ఫత్తామ్, మువాసీద్ కాసిమ్ చూపించిన తెగవను ఈ సందర్భంగా రషీద్ సలె ప్రశంసించారు. నిందితులు ఆసియా జాతీయులు. సుమారు 300,000 దిర్హామ్ల విలువైన ఐరన్ని ఈ ముఠా దొంగిలించింది. విధి నిర్వహణలో తమదైన ముద్ర వేసే అధికారులను సన్మానించడం ద్వారా ఇతరుల్లోనూ కొత్త ఉత్సాహం నింపాలన్నదే ఈ సన్మానం తాలూకు ముఖ్య ఉద్దేశ్యమని లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ అల్ షెహ్మి చెప్పారు. స్టేషన్ మేనేజ్మెంట్ తను సత్కరించడం పట్ల ఇద్దరు పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







