రియాద్ లో భారీగా అరెస్టులు
- November 10, 2017
రియాద్ : అవినీతి నిర్మూలన చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 200 మందికి పైగా నిందితులను అదుపులోకి చేశారు. అవినీతి చేపల ఏరివేత కోసం సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇటీవల 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మంది జడ్జీలను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. గత వారం రోజుల నుంచి కింగ్ సల్మాన్ ఆదేశాలతో అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో యువరాజులు మితెబ్ బిన్ అబ్దుల్లా, అల్వలీడ్ బిన్ తలాల్ సహా ట్విట్టర్, యాపిల్ సంస్థల్లో భారీగా పెట్టుబడిన పెట్టిన బడా వ్యాపార దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం.
మనీ లాండరింగ్, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణల కారణంగా యువరాజులు, మంత్రులు, వ్యాపార దిగ్గజాలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులను మొత్తంగా 200 మందికి పైగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సౌదీ అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ మోజిబ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని దశాబ్దాలుగా 6.5 లక్షల కోట్లమేర కుంభకోణాలు జరిగినట్లు గుర్తించడంతో కింగ్ సల్మాన్ విచారణకు ఆదేశించగా పోలీసుల ఆకస్మిక దాడులు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









