'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' బుక్ను ఆవిష్కరించిన కేసీఆర్
- November 11, 2017
ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన 'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' కాఫీ టేబుల్ బుక్ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో శనివారం ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని తైలవర్ణ చిత్రాలతోసహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ, కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 'ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం' పేరుతో తెలంగాణ పోలీస్ కు సంబంధించి నూతనంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, వీడియోఫిల్మ్తోపాటు ఆడియోసిడీని అనురాగ్శర్మ డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







