ఇరాక్లో భూకంపం... 7.3 తీవ్రత...భారీ ప్రాణ నష్టం
- November 12, 2017
బాగ్దాద్: ఇరాక్లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లలోని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదికి పరుగులు తీశారు. ఆదివారం అర్థరాత్రి వచ్చిన భూకంపం థాటికి 150 మంది మృతి చెందారు. వేలాది మందికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైందని అమెరికా భూభౌతిక సర్వే(యూఎస్జీఎస్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాబా పట్టణానికి 32 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. 14 రాష్ట్రాలపై భూకంప ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కువైట్, యూఏఈ లోనూ ఆదివారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.. అయితే ఇక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







